ఈనెల 8 నుంచి సెట్స్ పైకి సవ్యసాచి

Wednesday,November 01,2017 - 03:07 by Z_CLU

నాగచైతన్య అప్ కమింగ్ మూవీ సవ్యసాచి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై చందు మొండేటి దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈనెల 8 నుంచి సవ్యసాచి సినిమా సెట్స్ పైకి వస్తుంది. ఈ మేరకు అధికారికంగా సమాచారం అందించారు.

గతంలో నాగచైతన్య-చందు మొండేటి కాంబోలో ప్రేమమ్ లాంటి క్లీన్ లవ్ స్టోరీ వచ్చింది. ఈసారి మాత్రం వీళ్లిద్దరూ కలిసి డిఫరెంట్ ఎటెంప్ట్ చేస్తున్నారు. ఓ మనిషిలో అతడి ప్రమేయం లేకుండా ఎడమ చేయి పనిచేస్తే ఎలా ఉంటుంది.. కుడిచేయిలో ఉన్నంత శక్తి ఎడమ చేయిలో కూడా ఉంటే ఎలా ఉంటుంది.. లాంటి వినూత్నమైన కాన్సెప్ట్ తో ఈ సినిమా రాబోతోంది.

సవ్యసాచి సినిమాకు సంబంధించి ఇప్పటికే 3 ట్యూన్స్ ఫైనలైజ్ చేశారు. కీరవాణి ఈ సినిమాకు సంగీత దర్శకుడు. బాలీవుడ్ బ్యూటీ నిధి అగర్వాల్ ఈ సినిమాతో టాలీవుడ్ స్క్రీన్ కు పరిచయమౌతోంది.