200 కోట్ల గ్రాస్... సరిలేరు నీకెవ్వరు

Tuesday,January 21,2020 - 04:33 by Z_CLU

సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ `స‌రిలేరు నీకెవ్వ‌రు` బాక్సాఫీస్ వ‌ద్ద స‌రికొత్త రికార్డుల‌ను క్రియేట్ చేస్తూ స్ట్రాంగ్ క‌లెక్ష‌న్స్‌తో దూసుకుపోతుంది. ఇప్ప‌టికే 200 కోట్ల రియ‌ల్ గ్రాస్ క‌లెక్ష‌న్స్‌ను సాధించి సంక్రాంతి రియ‌ల్ ఛాంపియ‌న్‌గా నిలిచింద‌న్నారు ప్ర‌ముఖ నిర్మాత అనిల్ సుంక‌ర‌.

సూప‌ర్‌స్టార్ మ‌హేశ్ హీరోగా దిల్ రాజు శ్రీవెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో జి.ఎం.బి ఎంట‌ర్‌టైన్‌మెంట్, ఎ.కె. ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకాల‌పై అనిల్‌రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మించిన ఔట్ అండ్ ఔట్ మాస్ ఎంట‌ర్‌టైన‌ర్ `స‌రిలేరు నీకెవ్వ‌రు`.

ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్‌గా న‌టించిన ఈ చిత్రంలో ప్రొఫెస‌ర్ భార‌తీగా లేడీ అమితాబ్ విజ‌య‌శాంతి ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో న‌టించారు. సంక్రాంతి కానుక‌గా విడుద‌లైన ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డుల‌ను క్రియేట్ చేస్తోంది.