దర్శకుడి కొడుకుతో దర్శకురాలి సినిమా ?

Wednesday,June 02,2021 - 01:54 by Z_CLU

ప్రస్తుతం కొందరు కుర్ర హీరోలు సక్సెస్ ట్రాక్ ఎక్కడానికి చాలానే కష్టాలు పడుతున్నారు. అందులో సంతోష్ శోభన్ ఒకడు. గోల్కొండ హై స్కూల్ సినిమాతో నటుడిగా పరిచయమైన సంతోష్ తర్వాత హీరోగా మారి ‘తను నేను’,’పేపర్ బాయ్’ సినిమాలు చేశాడు. అయితే ఆ సినిమాలు తనకి హీరోగా గుర్తింపు అందించాయ్ కానీ సక్సెస్ ఇవ్వలేకపోయాయి. అయితే ఇటివలే సంతిష్ నటించిన ‘ఏక్ మినీ కథ’ ఓటిటి లో డైరెక్ట్ గా విడుదలై ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేస్తుంది. ఈ సినిమాతో ఎట్టకేలకు హీరోగా సక్సెస్ అందుకున్నాడు సంతోష్. కాకపోతే థియేటర్స్ లో కాకుండా OTT లో హిట్టు కొట్టాడు.

Ek Mini Katha Teaser Review

ఏక్ మినీ కథ OTTలో సక్సెస్ అవ్వడంతో ఈ కుర్ర హీరోకి ఇప్పుడు వరుస ఆఫర్స్ వస్తున్నాయట. తాజాగా నందినీ రెడ్డి సంతోష్ శోభన్ కి ఓ స్క్రిప్ట్ వినిపించి సినిమా చేయబోతుందని సమాచారం. వీరిద్దరి ప్రాజెక్ట్ త్వరలోనే ఎనౌన్స్ అవ్వనుందని అంటున్నారు. ఓ బేబీ తర్వాత నందినీ రెడ్డి ఓ లవ్ స్టోరీ ప్లాన్ చేసుకుంది. ఆ కథకి యాప్ట్ అనిపించే కుర్ర హీరో కోసం చూస్తోంది. ఇప్పటికే కొంత మంది యంగ్ హీరోస్ తో సంప్రదింపులు జరిపింది కూడా. అయితే ప్రస్తుతం యంగ్ హీరోస్ రెండు, మూడు ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉండటంతో ఇప్పుడు ఫైనల్ గా కథకి పర్ఫెక్ట్ అనిపించే సంతోష్ ని ఎంచుకుందట.

paper-boy-zeecinemalu-santosh-sobhan

సంతోష్ ప్రముఖ దర్శకుడు శోభన్ కొడుకు. శోభన్ గతంలో మహేష్ తో ‘బాబీ’, ప్రభాస్ తో ‘వర్షం’ సినిమా చేశాడు. వర్షం సినిమాతో దర్శకుడిగా బ్లాక్ బస్టర్ కొట్టి ప్రభాస్ ని స్టార్ హీరోగా మార్చేశాడు. అందుకే ఆ కృతజ్ఞతతోనే సంతోష్ శోభన్ ని సపోర్ట్ చేస్తూ సోషల్ మీడియా ద్వారా అతని సినిమా గురించి పోస్ట్ పెడుతూ ఉంటాడు ప్రభాస్.యూ.వీ.క్రియేషన్స్ సంస్థ ఏక్ మినీ కథ సినిమాను సంతోష్ శోభన్ తో నిర్మించడానికి మెయిన్ రీజన్ కూడా ప్రభాస్ నే. మరి ఈ కుర్ర హీరో నందినీ రెడ్డి సినిమాతో సూపర్ హిట్ కొడితే ఇక వెనక్కి తిరిగి చూసుకో అక్కర్లేదు.

  • – Follow us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics