సందీప్‌కిషన్ సినిమాపై క్లారిటీ

Wednesday,February 20,2019 - 06:48 by Z_CLU

‘సుబ్రహ్మణ్యపురం’ సినిమాతో  దర్శకుడిగా పరిచమైన సంతోష్ జాగర్లపూడి దర్శకతంలో సందీప్‌కిషన్ ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ సినిమాను సందీప్ కిషన్ చేయడం లేదని  నాగ శౌర్య చేస్తున్నాడని వార్తలొచ్చాయి. ఈ విషయంపై  క్లారిటీ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కుతుందని మరోసారి తెలియజేసారు.

 సుబ్రహ్మణ్యపురం చిత్రంతో అభిరుచి గల నిర్మాత పేరుపొందిన  బీరం సుధాకర్ రెడ్డి, కార్తీకేయ నిర్మాత వెంకట శ్రీనివాస్ బొగ్గరమ్‌లు సుధాకర్ ఇంప్లెక్స్ ఐపీఎల్ అండ్ టారస్ సినీ కార్స్ బ్యానర్స్ పై సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  క్రీడా నేపథ్యంలో సాగే కథ ఇది. అత్యంత ప్రాచీనమైన ధనుర్విధ్యలో ప్రధాన ఆకర్షణ లక్ష్యాన్ని ఛేదించడం.అత్యంత కష్టమైన  ఈ విద్య ద్వారా కథానాయకుడు తన లక్ష్యాన్ని ఎలా ఛేదించాడు అనేది చిత్ర కథ.వైవిధ్యమైన కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం అని తెలిపారు.