టాలీవుడ్ హాట్ టాపిక్.. నిర్మాతగా సమంత?

Thursday,February 27,2020 - 05:10 by Z_CLU

స్టార్ హీరోయిన్ సమంత నిర్మాతగా మారుతోంది.
భర్త నాగచైతన్యతో కలిసి ఓ బ్యానర్ స్థాపించబోతోంది.
ప్రస్తుతం ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తున్న గాసిప్ ఇది. ప్రస్తుతానికి ఇది గాసిప్పే కానీ కొట్టిపారేయడానికి లేదు. ఎందుకంటే కచ్చితంగా తను నిర్మాణరంగంలోకి వస్తానని సమంత ఇప్పటికే ఎన్నోసార్లు చెప్పింది. రీసెంట్ గా జాను ప్రమోషన్ లో కూడా ఇదే విషయాన్ని చెప్పుకొచ్చింది.

సో.. ఈసారి సమంత-చైతన్య కలిసి కొత్త బ్యానర్ పెట్టడం గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఈ వేసవిలో చైతూ-శ్యామ్ తమ కొత్త బ్యానర్ ను ప్రకటించి, దానిపై ఓ కొత్త సినిమాను కూడా ఎనౌన్స్ చేసే ఛాన్స్ ఉందంటున్నారు ఫిలింనగర్ జనాలు. ఈ మేరకు ఓ కొత్త దర్శకుడు చెప్పిన స్టోరీలైన్ కు ఈ జంట గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.

ఈ రూమర్ ఈ రేంజ్ లో వైరల్ అవ్వడానికి మరో చిన్న లాజిక్ కూడా యాడ్ అయింది. జాను తర్వాత ఇంతవరకు మరో సినిమా ఎనౌన్స్ చేయలేదు సమంత. కేవలం ప్రొడ్యూసర్ గా మారే ఉద్దేశంతోనే, ఆ పనుల్లో బిజీ అవ్వడం వల్లనే ఆమె సినిమాలు తగ్గించిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది. త్వరలోనే అక్కినేని కాంపౌండ్ నుంచి దీనిపై ఓ క్లారిటీ వస్తుందని ఆశిద్దాం.