SaiRam Shankar - రీసౌండ్ మళ్లీ మొదలైంది
Tuesday,November 17,2020 - 12:27 by Z_CLU
హీరో సాయిరామ్ శంకర్ ఒక ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం ద్వారా మురళీకృష్ణ దర్శకునిగా పరిచయమవుతున్నాడు. సాయిరామ్ శంకర్ సరసన హీరోయిన్ గా రాశీ సింగ్ నటిస్తోంది.
ఈ చిత్రానికి ‘రీసౌండ్‘ అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ టైటిల్ వినగానే మాసీగా ఉండి, ఆకట్టుకుంటోంది. ఈ సినిమా షూటింగ్ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ లో కొత్త షెడ్యూల్ షురూ అయింది.
ఇప్పటివరకూ 70 శాతం చిత్రీకరణ పూర్తయింది. తాజాగా ప్రారంభమైన షెడ్యూల్లో చిత్రంలోని ప్రధాన సన్నివేశాలను చిత్రీకరించనున్నారు.
‘రీసౌండ్’ మూవీని సురేష్ రెడ్డి, అయ్యప్పరాజు, రాజారెడ్డి నిర్మిస్తున్నారు. సాయిప్రకాష్ సినిమాటోగ్రాఫర్గా పనిచేస్తుండగా, స్వీకార్ అగస్తి సంగీత బాణీలు సమకూరుస్తున్నారు.