'అనుకోని అతిథి'గా మారిన సాయిపల్లవి

Sunday,August 11,2019 - 10:30 by Z_CLU

సాయిపల్లవి, ఫహద్ ఫాసిల్, ప్రకాష్ రాజ్ , అతుల్ కులకర్ణి నటించిన మలయాళ సినిమా ‘అధిరన్’ ఇప్పుడు తెలుగులో ‘అనుకోని అతిథి’ అనే  టైటిల్ తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.సైకలాజికల్‌ థ్రిల్లర్‌ గా తెరకెక్కిన ఈ సినిమాను జయంత్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై  శ్రీమతి దీప సురేందర్ రెడ్డి సమర్పణ లో ప్రముఖ నిర్మాత అన్నంరెడ్డి కృష్ణకుమార్ తెలుగులోఅనువదిస్తున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ ‘‘కేరళలో 1970లలో జరిగిన వాస్తవంగా జరిగిన ఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. సాయి పల్లవితోపాటు తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన ప్రకాశ్‌రాజ్ మరియు అతుల్‌ కులకర్ణి ప్రధాన పాత్రల్లో నటించారు. ప్రభాస్‌ ‘సాహో’కి నేపథ్య సంగీతం అందిస్తున్న జిబ్రాన్‌ ఈచిత్రానికి అద్భుతమైన నేపథ్య సంగీతం ఇచ్చారు. ప్రస్తుతం అనువాద కార్యక్రమాలు పూర్తి అయ్యి మిక్సింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఫస్ట్ లుక్ మరియు ట్రైలర్ రిలీజ్చేసి త్వరలో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని అనుకుంటున్నాం అని నిర్మాతలు చెప్పారు.

ప్రకాశ్‌రాజ్, అతుల్‌ కులకర్ణి,రెంజి పానికర్‌, లియోనా లిషోయ్‌, శాంతి కృష్ణ తదితరులు నటించిన ఈ చిత్రానికి పీఆర్వో: సురేంద్ర కుమార్ నాయుడు – ఫణి కందుకూరి, మాటలు: ఎం. రాజశేఖర్‌రెడ్డి, పాటలు: చరణ్‌ అర్జున్‌, మధు పమిడి కాల్వ, ఎడిటింగ్‌: అయూబ్‌ ఖాన్‌, కెమెరా: అను మోతేదత్‌, స్ర్కీన్‌ప్లే: పి.ఎఫ్‌. మాథ్యూస్‌, నేపథ్య సంగీతం: జిబ్రాన్‌, సంగీతం: పి.ఎస్‌. జయహరి, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: దక్షిన్‌ శ్రీన్వాస్,సమర్పణ: శ్రీమతి దీప సురేందర్ రెడ్డి; నిర్మాతలు:  అన్నంరెడ్డి కృష్ణకుమార్, గోవింద రవికుమార్; దర్శకత్వం: వివేక్‌