సొంతంగా డబ్బింగ్ చెప్పిన సాయి పల్లవి

Tuesday,June 20,2017 - 06:16 by Z_CLU

మొన్నటివరకు హీరోయిన్లంటే ప్యాకప్ వరకే. చెప్పిన షాట్ కంప్లీట్ చేసి ఇంటికెళ్లిపోయేవాళ్లు. కానీ ప్రస్తుతం కొంతమంది హీరోయిన్లు కేవలం యాక్టింగ్ కే ఫిక్స్ అయిపోవడం లేదు. కుదిరితే డబ్బింగ్ కూడా చెప్పి తమ టాలెంట్ చూపించాలనుకుంటున్నారు. ఇప్పటికే రకుల్, రెజీనా, తమన్న లాంటి హీరోయిన్లు సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నారు. ఇప్పుడీ లిస్ట్ లోకి సాయి పల్లవి కూడా చేరిపోయింది.

తెలుగులో చేస్తున్న మొదటి సినిమాకే డబ్బింగ్ కూడా చెబుతోంది సాయి పల్లవి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఫిదా సినిమా చేస్తోంది సాయిపల్లవి. తనకు మొదటి సినిమానే అయినప్పటికీ సొంతంగా డబ్బింగ్ చెబుతోంది. తాజాగా విడుదలైన టీజర్ లో సాయిపల్లవి వాయిస్ అందర్నీ ఎట్రాక్ట్ చేసింది. అయితే చాలామందికి అది సాయిపల్లవి సొంత గొంతు అనే విషయం తెలీదు. అందుకే సాయి పల్లవి డబ్బింగ్ చెబుతున్న మేకింగ్ వీడియోను తాజాగా విడుదల చేశారు.

వరుణ్ తేజ, సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఫిదా సినిమా షూటింగ్ ప్రస్తుతం ఫినిషింగ్ స్టేజ్ లో ఉంది. త్వరలోనే సినిమా ఆడియో రిలీజ్, విడుదల తేదీల్ని ప్రకటిస్తారు.