మూడు సినిమాలతో బిజీ ....

Sunday,May 21,2017 - 11:03 by Z_CLU

మలయాళ సినిమా ప్రేమమ్ లో తన అందం, నటనతో అందరినీ ఎట్రాక్ట్ చేసి నటి గా అదుర్స్ అనిపించుకున్న మలయాళీ భామ సాయి పల్లవి తెలుగు లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.. ప్రస్తుతం తెలుగులో ఈ అమ్మడు నటించిన ఒక్క సినిమా కూడా రిలీజ్ కాకుండానే మరో రెండు సినిమా ఆఫర్స్ అందుకుంది ఈ ముద్దుగుమ్మ..

ప్రెజెంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న ‘ఫిదా’ సినిమాలో వరుణ్ తేజ్ సరసన నటిస్తున్న ఈ అమ్మడు ఇటీవలే నాని MCA సినిమాలో హీరోయిన్ ఛాన్స్ అందుకున్న సంగతి తెలిసిందే.. అయితే ఈ రెండు సినిమాలతో పాటు లేటెస్ట్ గా మరో సినిమాకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట ఈ ముద్దుగుమ్మ. నాగ శౌర్య హీరోగా లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, తమిళ్ ల్లో ద్విభాషా సినిమాగా తెరకెక్కనున్న సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ అందుకుందట సాయి పల్లవి. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా జులై లో సెట్స్ పైకి వెళ్లనుందని సమాచారం.. సో ఈ మూడు సినిమాలతో టాలీవుడ్  లో బిజీ హీరోయిన్ గా మారనుందన్నమాట  మలయాళ బ్యూటీ …