కొత్త సినిమా స్టార్ట్ చేసిన మెగా హీరో

Monday,October 15,2018 - 12:38 by Z_CLU

మెగా సుప్రీమ్ హీరో సాయి ధరం తేజ్ కొత్త సినిమా లాంచ్ అయింది.. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తేజ్ నటించనున్న ‘చిత్రలహరి’ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఆఫీస్ లో పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు.  ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకున్న ఈ సినిమా అతి త్వరలోనే సెట్స్ పైకి రానుంది. కంప్లీట్  లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో న్యూ లుక్ లో కనిపించబోతున్నాడు తేజ్.

 

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్, రవి, మోహాన్ నిర్మించనున్న ఈ సినిమాలో తేజ్ సరసన కళ్యాణి ప్రియదర్సి హీరోయిన్ గా నటించనుంది. రాక్ స్టార్  దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ కంపోజర్.