షూటింగ్ కంప్లీట్ చేసుకున్న సాయి ధరమ్ తేజ్ సినిమా

Saturday,May 19,2018 - 10:36 by Z_CLU

కరుణాకరన్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సాయి ధరమ్ తేజ్ సినిమా సక్సెస్ ఫుల్ గా షూటింగ్ కంప్లీట్ చేసుకుంది. అల్టిమేట్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తేజ్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే.

రీసెంట్ గా ఫస్ట్ ఫీల్ పేరిట రిలీజైన ఈ సినిమా టీజర్ అందరినీ ఇంప్రెస్ చేయడంలో సక్సెస్ అయింది. ఇప్పుడు షూటింగ్ ప్రాసెస్ కూడా కంప్లీట్ అవ్వడంతో, ఈ సినిమా ప్రమోషన్స్ మరింత అగ్రెసివ్ గా చేయనున్నారు ఫిలిమ్ మేకర్స్. పారిస్ లోని లావిష్ లొకేషన్స్ లో తెరకెక్కిన ఈ సినిమా టాలీవుడ్ లో ఇంట్రెస్టింగ్ బజ్ క్రియేట్ చేస్తుంది.

ఇప్పటికే సైమల్టేనియస్ గా పోస్ట్ ప్రొడక్షన్ బిగిన్ చేసిన సినిమాయూనిట్, జూన్ లో ఈ సినిమాను రిలీజ్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకి K.S. రామారావు ప్రొడ్యూసర్. గోపి సుందర్ మ్యూజిక్ కంపోజర్.