చిత్రలహరి టీజర్ - క్యారెక్టర్స్ అదిరిపోయాయి

Wednesday,March 13,2019 - 11:44 by Z_CLU

సాయి ధరం తేజ్ లేటెస్ట్ మూవీ ‘చిత్రలహరి’ టీజర్ రిలీజయింది. టీజర్ తోనే ప్రమోషన్ ను స్టార్ట్ చేసారు మేకర్స్.  ” ‘చిత్రలహరి’ అప్పట్లో దూరదర్శన్ లో ఎవ్రీ ఫ్రైడే వచ్చే పాటల ప్రోగ్రాం.. ఈ ‘చిత్రలహరి’ 2019 లో ఓ ఫ్రైడే రిలీజవ్వబోయే సినిమా. అందులో కొన్ని పాటలు…ఇందులో కొన్ని పాత్రలు” అంటూ  క్రియేటివ్ సుకుమార్ వాయిస్ ఓవర్ తో స్టార్ట్ అయిన చిత్రలహరి టీజర్ సినిమాలో ఎంటర్ టైన్ మెంట్ ను ఎలివేట్ చేస్తూ ఆడియన్స్ ని ఎట్రాక్ట్ చేసింది. ముఖ్యంగా తేజ్ మెచ్యూర్డ్ లుక్ తో ఆకట్టుకున్నాడు.

సినిమాలో పాత్రలు ఎంత ఫన్ క్రియేట్ చేయబోతున్నాయనే విషయాన్నీ తెలియజేసింది టీజర్.. ముఖ్యంగా సాయి ధరం తేజ్ విజయ్ గా తన బాధను వ్యక్తం చేసే సన్నివేశాలు, అలాగే నివేత పెతురాజ్, కళ్యాణి ప్రియదర్శి క్యూట్ క్యారెక్టర్స్ , సునీల్ కామెడీ టైమింగ్ ఇలా అన్నీ టీజర్ లో చూపించారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా మంచి ఫీల్ తీసుకొచ్చింది. ఇక టీజర్ చివర్లో “బాధ పడకు బాబాయ్ నీకూ ఓ మంచి రోజొస్తుంది” అంటూ సుదర్శన్ అన్నప్పుడు “ఆ వచ్చేదేదో ఆదివారం పూట రమ్మని చెప్పు బాబాయ్” అంటూ తేజ్ చెప్పే డైలాగ్ టీజర్ లో హైలైట్ గా నిలిచింది.

ఫైనల్ గా నిమిషం నిడివితో విడుదలైన ఈ టీజర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయింది.   కిషోర్ తిరుమల డైరెక్షన్ లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా ఏప్రిల్ 12 న థియేటర్స్ లోకొస్తుంది.