మరో సినిమా కంప్లీట్ చేసిన పనిలో తేజ్

Tuesday,December 12,2017 - 02:59 by Z_CLU

వినాయక్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు సాయిధరమ్ తేజ్. లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతోంది. సాయిధరమ్ తేజ్ పై ఓ యాక్షన్ బ్లాక్ తీస్తున్నారు. ఈ షెడ్యూల్ తర్వాత సాంగ్స్ షూటింగ్ కోసం విదేశాలకు వెళ్లబోతున్నారు.

ఇంకా టైటిల్ ఫిక్స్ చేయని ఈ సినిమా షూటింగ్ టాకీ 70శాతానికి పైగా పూర్తయింది. 3 పాటలతో పాటు మరికొంత టాకీ బ్యాలెన్స్ ఉంది. త్వరలోనే సినిమా టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ ను విడుదల చేయబోతున్నారు. సీకే ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సి.కల్యాణ్ ఈ సినిమాని నిర్మిస్తున్నాడు.

వినాయక్ తో చేస్తున్న సినిమా ఓ కొలిక్కి రావడంతో వెంటనే మరో సినిమా రెగ్యులర్ షూట్ స్టార్ట్ చేశాడు సాయిధరమ్ తేజ్. కరుణాకరన్ దర్శకత్వంలో ఈరోజు నుంచి కొత్త సినిమా సెట్స్ పైకి వచ్చాడు తేజ్. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు కాలేజీలో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయింది. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కేఎస్ రామారావు నిర్మిస్తున్నారు.