రేపే సాక్ష్యం ఆడియో లాంఛ్

Friday,July 06,2018 - 05:00 by Z_CLU

బెల్లంకొండ సాయిశ్రీనివాస్ అప్ కమింగ్ మూవీ సాక్ష్యం. శ్రీవాస్ డైరక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. అంతకంటే ముందు పాటలతో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమా ఆడియోను రేపు గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు.

శిల్పకళావేదికలో సాయంత్రం 7 గంటల నుంచి సాక్ష్యం పాటల హంగామా మొదలుకానుంది. ఈ ఆడియో ఫంక్షన్ ను జీ సినిమాలు ఛానెల్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. జీ సినిమాలు యూట్యూబ్ ఛానెల్ లో కూడా సాక్ష్యం ఆడియో లాంచ్ లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

మరోవైపు ఈ సినిమాకు సంబంధించిన ఓ కీలకమైన సాంగ్ ను ఆడియో రిలీజ్ కంటే ముందే రిలీజ్ చేయబోతున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, ఏసుదాస్, హరిహరన్ , కైలాష్ ఖేర్, బాంబే జయశ్రీ.. ఇలా ఐదుగురు పాడిన ఈ పాటను రేపు ఉదయమే రిలీజ్ చేయబోతున్నారు.

అభిషేక్ పిక్చర్స్ బ్యానర్ పై అభిషేక్ నామా నిర్మాతగా తెరకెక్కుతోంది సాక్ష్యం మూవీ. బెల్లంకొండ కెరీర్ లో భారీ బడ్జెట్ సినిమా ఇది. ఇప్పటికే టీజర్ కు ట్రమండస్ రెస్పాన్స్ రావడం, లేటెస్ట్ సెన్సేషన్ పూజా హెగ్డే హీరోయిన్ గా నటించడంతో సాక్ష్యంపై క్రేజ్ డబుల్ అయింది. హర్షవర్థన్ రామేశ్వరన్ ఈ సినిమాకు ట్యూన్స్ అందించాడు.