సాహో ఫస్ట్ సాంగ్.. టాలీవుడ్ కు బాలీవుడ్ టచ్

Monday,July 08,2019 - 11:45 by Z_CLU

పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోంది సాహో. దాదాపు 250 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను అన్ని భాషలకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కిస్తున్నారు. ఇందులో భాగంగా బాలీవుడ్ నటీనటుల్ని కూడా తీసుకున్న మేకర్స్, ఇప్పుడు పాటల్లో కూడా అదే ఫ్లేవర్ చూపించారు.

కొద్దిసేపటి కిందట విడుదలైన “సైకో సయ్యా” అనే సాంగ్ చూస్తే ఇది తెలుగు పాట లేక బాలీవుడ్ పాటా అనే ఫీలింగ్ కలుగుతుంది. అలా కంప్లీట్ వెస్ట్రన్ బీట్ లో కంపోజ్ చేశారు. కేవలం పాట కంపోజిషన్ మాత్రమే కాదు… పాట మేకింగ్, కొరియోగ్రఫీ కూడా బాలీవుడ్ స్టయిల్ లో సాగింది.

లిరికల్ వీడియో రూపంలో పాట రిలీజ్ అవుతుందని భావించిన ప్రేక్షకులకు టోటల్ వీడియో రిలీజ్ చేసి షాకిచ్చారు మేకర్స్. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్ తనిష్క్ బాగ్చీ ఈ పాటను కంపోజ్ చేయడంతో పాటు.. అనిరుధ్ రవిచంద్రన్, ధ్వని భానుషాలీతో కలిసి ఆలపించాడు కూడా.

సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సాహోలో ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. వచ్చేనెల 15న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ కానుంది సాహో.