కేవలం ఫైట్స్ కోసం రూ.25 కోట్లు

Monday,September 11,2017 - 11:47 by Z_CLU

బాహుబలి-2 లాంటి భారీ విజయం తర్వాత ప్రభాస్ నటిస్తున్న మూవీ సాహో. కంప్లీట్ యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం ఏకంగా 150 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించింది యూవీ క్రియేషన్స్ బ్యానర్. ఇందులో అచ్చంగా 25 కోట్ల రూపాయల్ని కేవలం ఫైట్స్ కోసమే ఖర్చుచేస్తున్నారట. హాలీవుడ్ స్టంట్ మాస్టర్ కెన్నీ బేట్స్ ఆధ్వర్యంలో ఈ ఫైట్స్ ను చిత్రీకరించబోతున్నారు. అది కూడా దుబాయ్ లో.

సాహో సినిమాలో కేవలం హీరో-విలన్ మధ్య మాత్రమే ఫైట్స్ ఉండవు. హీరో-హీరోయిన్, విలన్-హీరోయిన్ మధ్య కూడా ఫైట్స్ ఉంటాయి. ఈ ఫైట్స్ అన్నీ హాలీవుడ్ రేంజ్ లో ఉంటాయంటోంది యూనిట్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. త్వరలోనే జరగనున్న భారీ షెడ్యూల్ ఈ ఫైట్ సీక్వెన్స్ కంపోజ్ చేయబోతున్నారు.

ప్రభాస్ సరసన శ్రద్ధాకపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో నీల్ నితిన్ ముఖేష్ మెయిన్ విలన్ గా కనిపిస్తాడు. నీల్ తో పాటు మరో జాకీష్రాఫ్, చుంకీపాండే కూడా విలన్లుగా కనిపించనున్నారు. బాలీవుడ్ మ్యూజిక్ డైరక్టర్స్ శంకర్-ఎహసాన్-లాయ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.