పుకార్లు నమ్మొద్దు - నిర్మాతలు భగవాన్, పుల్లారావు

Tuesday,April 14,2020 - 02:10 by Z_CLU

రీసెంట్ గా కొత్త సినిమా లాంఛ్ చేశాడు సాయితేజ్. దేవ కట్టా దర్శకత్వంలో డిఫరెంట్ సబ్జెక్ట్ తో రాబోతున్న ఈ సినిమా పవన్ కల్యాణ్ చేతుల మీదుగా లాంఛ్ అయింది. హీరోయిన్ గా నివేత పెతురాజ్ ను సెలక్ట్ చేశారు. ఓపెనింగ్ కు ఆమె కూడా ఎటెండ్ అయింది.

అయితే ఇతర నటీనటులకు సంబంధించి మీడియాలో రోజుకో గాసిప్ వస్తోంది. దీంతో నిర్మాతలు రంగంలోకి దిగారు. తమ సినిమాలో నటీనటుల ఎంపికపై వస్తున్న పుకార్లను నమ్మొద్దంటూ స్టేట్ మెంట్ ఇచ్చారు జె.బి.ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ నిర్మాతలు భగవాన్, పుల్లారాలు.

‘‘సాయితేజ్, దేవా కట్ట కాంబినేషన్‌లో మా బ్యాన‌ర్‌లో చేస్తున్న సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా కార‌ణంగా ప్ర‌పంచంలోని ప్ర‌జ‌లంద‌రూ ఇబ్బంది ప‌డుతున్నారు. మ‌న దేశంలో లాక్‌డౌన్ కొన‌సాగుతుంది. ఇలాంటి ప‌రిస్థితుల్లో షూటింగ్ చేయ‌లేం. కాబ‌ట్టి క‌రోనా వైర‌స్ ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ వివ‌రాల‌ను తెలియ‌జేస్తాం. అలాగే సినిమాలో న‌టించ‌బోయే న‌టీన‌టుల గురించి కూడా సోష‌ల్ మీడియాలో ప‌లు ర‌కాలైన వార్త‌లు విన‌ప‌డుతున్నాయి. అవ‌న్నీ అవాస్త‌వాలు. పుకార్ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని మ‌న‌వి. సినిమాకు సంబంధించిన విష‌యాల‌ను మేమే అధికారికంగా తెలియ‌జేస్తాం’’