తాజా వార్తలు
Tuesday,April 14,2020 - 02:10 by Z_CLU
‘‘సాయితేజ్, దేవా కట్ట కాంబినేషన్లో మా బ్యానర్లో చేస్తున్న సినిమా రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 20 నుండి ప్రారంభం కావాల్సింది. కానీ కరోనా కారణంగా ప్రపంచంలోని ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు. మన దేశంలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో షూటింగ్ చేయలేం. కాబట్టి కరోనా వైరస్ ప్రభావం తగ్గిన తర్వాత సినిమా రెగ్యులర్ షూటింగ్ వివరాలను తెలియజేస్తాం. అలాగే సినిమాలో నటించబోయే నటీనటుల గురించి కూడా సోషల్ మీడియాలో పలు రకాలైన వార్తలు వినపడుతున్నాయి. అవన్నీ అవాస్తవాలు. పుకార్లను నమ్మవద్దని మనవి. సినిమాకు సంబంధించిన విషయాలను మేమే అధికారికంగా తెలియజేస్తాం’’