అనుష్కపై వస్తున్న పుకార్లు నమ్మొద్దు

Wednesday,April 22,2020 - 12:00 by Z_CLU

కొన్ని రోజులుగా అనుష్కపై ఓ రకమైన రూమర్ షికారు చేస్తోంది. ఆమె నటించిన నిశ్శబ్ధం అనే సినిమాను ఓటీటీకి ఇవ్వడానికి నిర్మాత ప్రయత్నిస్తుంటే అనుష్క అడ్డుపడుతోందట. తన సినిమా ముందుగా థియేటర్లలోనే రిలీజ్ అవ్వాలని, ఓటీటీకి ఎంత మాత్రం ఇవ్వడానికి వీళ్లేదంటూ అభ్యంతరం వ్యక్తం చేస్తోందట.

దాదాపు 3 రోజులుగా వినిపిస్తున్న ఈ పుకారుపై ఎట్టకేలకు సినిమా యూనిట్ క్లారిటీ ఇచ్చింది. అనుష్క బంగారం అంటోంది నిశ్శబ్దం సినిమాను నిర్మించిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. షూటింగ్ స్టార్ట్ అయిన మొదటి రోజు నుంచి ఇప్పటివరకు అనుష్క అందిస్తున్న మద్దతు మరువలేనిదని, ఆమెపై వస్తున్న పుకార్లలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టంచేసింది.

ఇకపై తమ సినిమాకు సంబంధించి ఎలాంటి పుకార్లు నమ్మొద్దని విజ్ఞప్తి చేస్తోంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ. ఏదైనా ఉంటే అధికారికంగా తాము ప్రకటిస్తామని చెబుతోంది. లాక్ డౌన్ ఎత్తేసిన వెంటనే నిశ్శబ్దం రిలీజ్ డేట్ ను అఫీషియల్ గా ప్రకటిస్తారు.