ఇకపై అంతా 'బ్యూటిఫుల్' అంటున్న వర్మ

Saturday,December 21,2019 - 01:41 by Z_CLU

అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాతో మొన్నటివరకు సంచలనాలు, వివాదాలు సృష్టించిన రామ్ గోపాల్ వర్మ, ఇప్పుడా సినిమాను లైట్ తీసుకున్నాడు. తన ఫోకస్ మొత్తం బ్యూటిఫుల్ సినిమాపై పెట్టాడు. జనవరి 1న రిలీజ్ కానుంది ఈ మూవీ.

టైగర్ కంపెనీ ప్రొడక్షన్ పతాకంపై వర్మ రూపొందించిన ఈ సినిమాకు ట్రిబ్యూట్ టు రంగీలా అనే ట్యాగ్ లైన్ పెట్టారు. నైనా కథానాయిక కాగా సూరి కధానాయకుడిగా నటించారు. అగస్త్య మంజు దర్శకుడు. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా `ఎ` సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రాన్ని నూతన సంవత్సరం సందర్బంగా జనవరి 1న ప్రంపంచ వ్యాప్తంగా భారీగా విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు వెల్లడించారు.

ఈ చిత్రానికి పాటలను సిరా శ్రీ అందించగా…సంగీతాన్ని రవి శంకర్ సమకూర్చారు. ఈ చిత్రానికి సహ నిర్మాతలు: నట్టి క్రాంతి, నట్టి కరుణ, సమర్పణ: టి.అంజయ్య, నిర్మాతలు: టి నరేష్ కుమార్, టి.శ్రీధర్, , రచన, ఫోటోగ్రఫీ, దర్శకత్వం: అగస్త్య మంజు.