సంఘసంస్కర్తగా రేణుదేశాయ్.. రీఎంట్రీ ఫిక్స్

Tuesday,February 19,2019 - 07:25 by Z_CLU

పవన్ సరసన బద్రి, జానీ సినిమాల్లో నటించిన రేణుదేశాయ్ మరోసారి టాలీవుడ్ సిల్వర్ స్క్రీన్ పైకి రాబోతున్నారు. కచ్చితంగా రీఎంట్రీ ఉంటుందని గతంలోనే ప్రకటించిన రేణుదేశాయ్, ఇప్పుడా సినిమా డీటెయిల్స్ ను స్వయంగా షేర్ చేశారు. వంశీ కృష్ణ ఆకెళ్ల దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో కీలక పాత్ర పోషించబోతున్నారు రేణు.

ప్రముఖ సంఘ సంస్కర్త, రచయిత హేమలత లవణం పాత్రను తెరపై పోషించబోతున్నారు రేణుదేశాయ్. స్వతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత సామాజిక పరివర్తన కోసం తీవ్రంగా కృషిచేశారు హేమలత. దీనికి సంబంధించి ఆమె ఎన్నో రచనలు కూడా చేశారు. ఈమె పాత్రతో వంశీకృష్ణ ఓ స్టోరీ రాసుకున్నాడు. ఆ పాత్రనే రేణుదేశాయ్ పోషించబోతున్నారు.

కేవలం వంశీకృష్ణ సినిమానే కాకుండా, మరో సినిమాకు కూడా కమిట్ అయిన రేణుదేశాయ్, ఆ వివరాల్ని కూడా త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు. రీసెంట్ గా ఆమె రాసిన ఇంగ్లిష్ కవితల్ని తెలుగులో అనువదించారు. మరాఠిలో రేణుదేశాయ్ ఓ సినిమాను కూడా డైరక్ట్ చేశారు.