Renu Desai - పాన్ ఇండియా మూవీతో రీఎంట్రీ

Thursday,October 15,2020 - 01:55 by Z_CLU

రేణు దేశాయ్ రీఎంట్రీకి మొత్తం రెడీ అయింది. ఏకంగా పాన్-ఇండియా సినిమాతో ఆమె రీఎంట్రీ ఇవ్వబోతోంది. సెకెండ్ ఇన్నింగ్స్ లో ఆమె చేయబోయే తొలి చిత్రం పేరు ఆద్య.

డి.ఎస్.కె.స్క్రీన్-సాయికృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై రావ్.డి.ఎస్- రజనీకాంత్.ఎస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ ప్రతిష్టాత్మక భారీ బడ్జెట్ చిత్రం తో కృష్ణ మామిడాల దర్శకుడిగా పరిచయమవుతున్నాడు.

‘కబాలి’ ఫేమ్ సాయి ధన్సిక, నందిని రాయ్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ హీరో ‘వైభవ్ తత్వవాడి’ ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు. ‘హుషారు’ ఫేమ్ తేజ కురపాటి- గీతిక రతన్ యువ జంటగా నటించే ‘ఆద్య’ విజయదశమి రోజు ఆరంభం కానుంది.