రెజీనా రేంజ్ మారింది...

Wednesday,January 08,2020 - 10:02 by Z_CLU

గ్లామరస్ హీరోయిన్ అనిపించుకుంది. ఆ తరవాత ‘ఎవరు’ సినిమాలో డిఫెరెంట్ క్యారెక్టర్ లో మెస్మరైజ్ చేసింది. ప్రస్తుతం కార్తీక్ రాజు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో ఫైట్స్ చేయబోతుంది రెజీనా. ఈ యాక్షన్ సీక్వెన్సెస్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ తీసుకుంటుంది రెజీనా.

రెగ్యులర్ హీరోయిన్ రోల్స్ ఆల్మోస్ట్ ఆపేసింది రెజీనా. ఫోకస్ మొత్తం ఫీమేల్ ఓరియంటెడ్ సినిమాలపై పెట్టింది. అయితే ప్రస్తుతం సెట్స్ పై ఉన్న మిస్టరీ థ్రిల్లర్ లో ఆర్కియాలజిస్ట్ గా నటిస్తుంది. ఈ సినిమాలోని కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటిస్తుందట రెజీనా.

ప్రస్తుతం ఫాస్ట్ పేజ్ లో షూటింగ్ జరుపుకుంటున్న మేకర్స్ త్వరలో ఈ సినిమా ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసే ఆలోచనలో ఉన్నారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్ పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నాడు.