ఇట‌లీలో 'ఖిలాడి' ‌‌

Saturday,March 20,2021 - 12:19 by Z_CLU

‘క్రాక్’ బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా, ‘రాక్ష‌సుడు’ ఫేమ్ ర‌మేష్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న హై ఓల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ‘ఖిలాడి’‌. ప్ర‌స్తుతం ఈ సినిమా షూటింగ్ ఇట‌లీలోని అంద‌మైన లొకేష‌న్ల‌లో జ‌రుగుతోంది. అక్కడ ర‌వితేజ స‌హా ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు.

ర‌వితేజ ద్విపాత్రాభిన‌యం చేస్తున్న ఈ సినిమాకు స‌త్య‌నారాయ‌ణ కోనేరు నిర్మాత‌.  డా. జ‌యంతీలాల్ గ‌డ  స‌మ‌‌ర్ప‌ణ‌లో ఏ స్టూడియోస్‌తో క‌లిసి బాలీవుడ్ నిర్మాణ సంస్థ పెన్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ర‌వితేజ స‌ర‌స‌న మీనాక్షి చౌధ‌రి మెయిన్ హీరోయిన్‌గా న‌టిస్తుండ‌గా, డింపుల్ హ‌య‌తి సెకండ్ హీరోయిన్ రోల్ చేస్తున్నారు.

హ‌వీష్ ప్రొడ‌క్ష‌న్‌లో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీకి  ‘ప్లే స్మార్ట్’ అనేది ట్యాగ్‌లైన్‌. మే 28న ‘ఖిలాడి’ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా థియేట‌ర్ల‌లో విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు జ‌రుగుతున్నాయి.