పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో రవితేజ్ టచ్ చేసి చూడు

Saturday,December 30,2017 - 11:02 by Z_CLU

ఫాస్ట్ పేజ్ లో రిలీజ్ కి రెడీ అవుతుంది రవితేజ ‘టచ్ చేసి చూడు’. బెంగాల్ టైగర్ తరవాత లాంగ్ గ్యాప్ తీసుకున్న రవితేజ రీసెంట్ గా రిలీజైన ‘రాజా ది గ్రేట్’, ఆ తరవాత ఇమ్మీడియట్ గా ‘టచ్ చేసి చూడు’ సినిమాతో ఫ్యాన్స్ ని మెస్మరైజ్ చేయడానికి రెడీ అవుతున్నాడు.

విక్రమ్ సిరికొండ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్ టైనర్ కి వక్కంతం వంశీ స్టోరీ రాశాడు. ప్రస్తుతం షూటింగ్ ప్యాకప్ చెప్పి పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న సినిమా యూనిట్, త్వరలో ఈ సినిమా రిలేజ్ డేట్ ని అనౌన్స్ చేసే ప్రాసెస్ లో ఉన్నారు.

జామ్ 8 మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్, వల్లభనేని వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. రాశిఖన్నా, సీరత్ కపూర్ లు హీరోయిన్స్ గా నటించారు.