Wednesday,April 13,2022 - 03:34 by Z_CLU
అభిషేక్ పిక్చర్స్, ఆర్టీ టీం వర్క్స్ బ్యానర్లపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. రవితేజ లాయర్ గా కనిపించబోతున్న ఈ సినిమాలో సుశాంత్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు.
సినిమాలో రవితేజ సరసన ఐదుగురు హీరోయిన్లు నటించనున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు కీలక పాత్రలు పోషిస్తున్నారు.
శ్రీకాంత్ విస్సా ఈ సినిమాకి పవర్ ఫుల్ కథతో పాటు మాటలు, స్క్రీన్ ప్లే అందించాడు. దర్శకుడు సుధీర్ వర్మ , మాస్ మహారాజా రవితేజని సరికొత్తగా చూపించబోతున్నారు.
ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పని చేస్తున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్గా, శ్రీకాంత్ ఎడిటర్గా పని చేస్తున్నారు.