Rashmika - బాలీవుడ్ ఎంట్రీ
Saturday,December 26,2020 - 11:35 by Z_CLU
సౌత్ బ్యూటీ, టాలీవుడ్లో టాప్ హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న రష్మికా మందన్న బాలీవుడ్లో అడుగుపెడుతోంది. సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా నటిస్తున్న ‘మిషన్ మజ్ను’ మూవీలో ఆమె హీరోయిన్ గా సెలక్ట్ అయింది. ఈ బిగ్ ఫిల్మ్లో భాగం కావడంతో ఆమె ఎగ్జయిట్ అవుతున్నారు.
శంతను బాగ్చి డైరెక్టర్గా పరిచయమవుతున్న ఈ మూవీలో సిద్ధార్థ్ మల్హోత్రా RAW ఏజెంట్గా నటిస్తున్నారు. పర్వీజ్ షేక్, అసీమ్ అరోరా, సుమిత్ బతేజా రచన చేస్తున్న ‘మిషన్ మజ్ను’ను గూల్టీ, ఆర్ఎస్వీపీ బ్యానర్లపై అమర్ బుటాలా, గరిమా మెహతా, రోనీ స్క్రూవాలా నిర్మిస్తున్నారు.
యథార్థ ఘటనల ప్రేరణతో, భారతదేశపు అత్యంత ప్రతిష్ఠాత్మక కోవర్ట్ ఆపరేషన్ నేపథ్యంలో ‘మిషన్ మజ్ను’ రూపొందుతోంది.
ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్తో ‘పుష్ప’, శర్వానంద్ జోడీగా ‘ఆడాళ్లూ మీకు జోహార్లు’ సినిమాల్లో రష్మిక యాక్ట్ చేస్తోంది