ఈసారి గీతాచైతన్యం.. క్రేజీ కాంబినేషన్

Wednesday,February 12,2020 - 09:52 by Z_CLU

వరుస అవకాశాలతో దూసుకుపోతోంది గీతగోవిందం బ్యూటీ రష్మిక. ఇప్పటికే మహేష్ సరసన నటించిన ఈ చిన్నది, త్వరలోనే బన్నీ-సుకుమార్ సినిమాలో కూడా మెరవనుంది. ఇప్పుడీ స్టార్ హీరోయిన్ మరో క్రేజీ ప్రాజెక్ట్ లో నటించే అవకాశం కొట్టేసింది.

నాగచైతన్య-పరశురాం కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో హీరోయిన్ గా రష్మికను అనుకుంటున్నారు. ఇంతకుముందు పరశురాం తీసిన గీతగోవిందం సినిమాలో రష్మిక హీరోయిన్ గా నటించింది. ఆ సెంటిమెంట్ ను చైతూ సినిమాకు కూడా కంటిన్యూ చేయాలని అనుకుంటున్నాడు దర్శకుడు. అప్పుడు గీతాగోవిందం.. ఇప్పుడు గీతాచైతన్యం అన్నమాట.

చైతూకు యూత్ లో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. ఇక రష్మిక కూడా కుర్రాళ్ల హాట్ ఫేవరెట్. వీళ్లిద్దరూ కలిసి సినిమా చేస్తున్నారంటే కచ్చితంగా అది క్రేజీ కాంబినేషన్ అవుతుంది. 14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మాతలుగా ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రానుంది.

రీసెంట్ గా గద్దలకొండ గణేష్ సినిమాతో సూపర్ హిట్ అందుకుంది ఈ బ్యానర్. తమిళ్ లో కల్ట్ మూవీగా పేరుతెచ్చుకున్న జిగర్తాండాను తెలుగులో రీమేక్ చేసి మంచి టేస్ట్ ఉన్న ప్రొడ్యూసర్స్ అనిపించుకున్నారు రామ్, గోపి. అదే ఊపులో శర్వానంద్ హీరోగా శ్రీకారం అనే డిఫరెంట్ మూవీని నిర్మిస్తున్నారు. ఇప్పుడు నాగచైతన్య-పరశురాం కాంబోలో మరో క్రేజీ మూవీ స్టార్ట్ చేయబోతున్నారు.