కామెడీతో ఇరగదీశారు

Sunday,December 29,2019 - 12:04 by Z_CLU

ఏ నటుడికైన తనలో ఉన్న మరో కోణాన్ని బయటపెట్టే పాత్రలు రావాలి. అప్పుడే ఆ నటుడు ప్రేక్షకులను విపరీతంగా ఎంటర్టైన్ చేయగలడు. అయితే ఈ ఏడాది చివర్లో ఓ ఇద్దరు నటులకు ఆ ఛాన్స్ వచ్చింది. ఇక చేప్పేదేం ఉంది తమ కామెడీ టైమింగ్ తో థియేటర్స్ లో విపరీతంగా నవ్వించి సినిమా విజయంలో ముఖ్య భాగం అయ్యారు.

ఆ ఇద్దరిలో ఒకరు రావు రమేష్. ఇప్పటికే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో మంచి పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించిన రావు రమేష్ ‘ప్రతి రోజు పండగే’ లో మంచి పాత్ర దక్కడంతో అందరినీ డామినేట్ చేసి ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో ఎంటర్టైన్ చేసాడు. కథ చెప్పేటప్పుడే సినిమాలో మీ పాత్ర కీలకమని నవ్వించినా ..ఏడిపించినా..కథలో ఉన్న ఎమోషన్ చెప్పినా మీ పాత్ర ద్వారానే అంటూ మారుతి చెప్పగానే పాత్రలో పరకాయ ప్రవేశం చేసేసాడు రావు రమేష్. ఆ పాత్ర ద్వారా పుట్టిన కామెడీతో రావు రమేష్ సినిమాకు హైలైట్ నిలిచాడు. ముఖ్యంగా డైనింగ్ టేబుల్ సీన్ కయితే ఆడియన్స్ నాన్ స్టాప్ గా నవ్వుతూనే ఉంటారు.

‘మత్తు వదలరా’ సినిమాతో కమెడియన్ సత్య ను రీ లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించి టైటిల్స్ లో కూడా అదే వేసారు. మేకర్స్ చెప్పినట్లు నిజంగా సత్యకి ఇది రీ లాంచ్. ఇప్పటి వరకూ తను ఎన్ని పాత్రలు చేసి నవ్వించినా ‘మత్తు వదలరా’ ఆ లిస్టులో ఎప్పటికీ టాప్ ప్లేస్ లో ఉంటుంది. సినిమా ప్రారంభం నుండి చివరి వరకూ సత్య పండించిన కామెడీకి థియేటర్స్ లో ప్రేక్షకులు పొట్ట చెక్కలయ్యేలా నవ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు.

సో ఈ ఏడాది అదిరిపోయే పాత్రలు దొరకడంతో ఈ ఇద్దరు నటులు ప్రేక్షకులకు తమ పాత్రల ద్వారా చక్కని వినోదం అందించి హాస్యాన్ని ఇష్టపడే వారికి 2019 గుర్తుండి పోయేలా చేసారు.