RangDe - రేపే ట్రయిలర్ లాంఛ్

Thursday,March 18,2021 - 10:17 by Z_CLU

నితిన్-కీర్తిసురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న సినిమా రంగ్ దే. వెంకీ అట్లూరి డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. టీజర్ సూపర్ హిట్టవ్వడంతో పాటు దేవిశ్రీప్రసాద్ కంపోజ్ చేసిన పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలవడంతో.. ఎక్స్ పెక్టేషన్స్ పెరిగాయి.

ఈ అంచనాల్ని మరింత పెంచుతూ.. రేపు రంగ్ దే ట్రయిలర్ ను లాంఛ్ చేయబోతున్నారు. దీని కోసం కర్నూలును సెలక్ట్ చేశారు. రేపు సాయంత్రం 6 గంటలకు కర్నూలులోని STBC కాలేజ్ లో జరిగే భారీ ఫంక్షన్ లో రంగ్ దే ట్రయిలర్ ను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు.

rangde nithin

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ సినిమాకు పీసీ శ్రీరామ్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేయడం పెద్ద ఎస్సెట్. మార్చి 26న వరల్డ్ వైడ్ థియేటర్లలోకి రాబోతోంది రంగ్ దే.