RangDe - దేవిశ్రీ+సిద్ శ్రీరామ్ మేజిక్

Thursday,March 04,2021 - 05:49 by Z_CLU

బ్లాక్ బస్టర్ మ్యూజిక్ డైరక్టర్ దేవిశ్రీప్రసాద్, సెన్సేషనల్ సింగర్ సిద్ శ్రీరామ్ ఫస్ట్ టైమ్ కలిశారు. ఇద్దరూ కలిసి రంగ్ దే సినిమాకు వర్క్ చేశారు. అలా మోస్ట్ ఎవెయిటింగ్ కాంబోగా పాపులర్ అయిన వీళ్లిద్దరి నుంచి ఎట్టకేలకు ఓ సాంగ్ వచ్చింది. ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది.

“నా కనులు ఎపుడూ కననే కనని..” అనే లిరిక్స్ తో సాగే ఈ పాటను సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేశాడు. యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు.

శ్రీమణి రాసిన సాహిత్యానికి దేవిశ్రీ అద్భుతమైన మెలొడీ కంపోజ్ చేయగా.. సిద్ శ్రీరామ్ తన మెస్మరైజింగ్ వాయిస్ ను యాడ్ చేశాడు.

నితిన్, కీర్తిసురేష్ జంటగా నటించిన ఈ సినిమాను సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నాడు. ఈనెల 26న థియేటర్లలో గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతోంది రంగ్ దే.