రంగస్థలం లాస్ట్ షెడ్యూల్ ప్రారంభం

Saturday,February 24,2018 - 10:40 by Z_CLU

రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న రంగస్థలం సినిమా పైనల్ షెడ్యూల్ ఈరోజు నుంచి మొదలైంది. ఇది జస్ట్ ప్యాచ్ వర్క్ మాత్రమే. సినిమాకు సంబంధించి 4 రోజుల పాటు చిన్నచిన్న సన్నివేశాలు తీయబోతున్నారు. దీంతో రంగస్థలం సినిమాకు సంబంధించి టోటల్ షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది.

మూవీకి సంబంధించి ఇప్పటికే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ అయింది. ఆడియోను దశలవారీగా సోషల్ మీడియాలో రిలీజ్ చేస్తున్నారు. మార్చి 3న టోటల్ జూక్ బాక్స్ ను రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. ఇక ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను మార్చి 15న విశాఖలో గ్రాండ్ గా సెలబ్రేట్ చేయబోతున్నారు. సినిమాను మార్చి 30న థియేటర్లలోకి తీసుకొస్తున్నారు.

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో తెరకెక్కింది రంగస్థలం సినిమాలో 1985 నాటి పరిస్థితుల్ని ప్రతిబింబించేలా, అప్పటి స్టోరీలైన్ తో ఈ సినిమా తెరకెక్కింది. సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి అనసూయ కీలక పాత్రలు పోషించారు.