'రంగస్థలం' కథ వినకుండానే !

Friday,February 07,2020 - 11:06 by Z_CLU

రెండేళ్ళ క్రితం రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన ‘రంగస్థలం’ ఏ రేంజ్ హిట్ సాధించిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో లచ్చిమి పాత్రలో ఒదిగిపోయి నటించి హీరోయిన్ గా మంచి మార్కులందుకుంది సమంత. అయితే ఇటివలే ఓ ఇంటర్వ్యూలో ‘రంగస్థలం’ సినిమా చేసే ముందు తనకు మొత్తం కథ తెలియదని తన పాత్రతో పాటు కొంచెం స్టోరీ మాత్రం తెలుసని ఆ సినిమా విషయంలో తన జడ్జిమెంట్ ఏం లేదని, అది జస్ట్ లక్ మాత్రమే అంటూ చెప్పుకొచ్చింది.

చైతూకి ఎలాంటి సలహాలు ఇవ్వనని ఇచ్చే జడ్జిమెంట్ తనకు ఇంకా రాలేదని తెలిపింది. సినిమాలు మానేసాక కూడా కొందరు హీరోయిన్స్ గురించి, చేసిన సినిమాల గురించి ప్రేక్షకులు మాట్లాడుకుంటారని, అలా తన గురించి కూడా చెప్పుకోవాలనే ఉద్దేశ్యంతోనే మంచి పాత్రలు , సినిమాలు సెలెక్ట్ చేసుకుంటున్నానని మనసులో మాట బయటపెట్టింది సామ్. ఈ రోజు ‘జాను’తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సమంత తన పెర్ఫార్మెన్స్ తో మెస్మరైజ్ చేసి తన కెరీర్ లో మరో మంచి పాత్రను లిస్టులో వేసుకుంది.