రానా సినిమా కూడా పోస్ట్ పోన్

Monday,March 16,2020 - 12:50 by Z_CLU

కరోనా ఎఫెక్ట్ రానా సినిమాపై కూడా పడింది. ఏడాదిన్నర పాటు కష్టపడి తీసిన అరణ్య సినిమా విడుదలను వాయిదావేస్తూ యూనిట్ అఫీషియల్ గా ఎనౌన్స్ మెంట్ ఇచ్చింది.

లెక్కప్రకారం, ఏప్రిల్ 2న ఈ సినిమా థియేటర్లలోకి రావాలి. ఒకేసారి సౌత్ లోని అన్ని భాషలతో పాటు హిందీలో దీన్ని రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ కరోనా కారణంగా దేశవ్యాప్తంగా చాలా రాష్ట్రాల్లో థియేటర్లు బంద్ అయ్యాయి. దీంతో తప్పనిసరి పరిస్థితుల మధ్య అరణ్య వాయిదాపడింది.

ప్రస్తుతానికి మేకర్స్ తమ సినిమాను పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మాత్రమే ప్రకటించారు. కొత్త రిలీజ్ డేట్ పై ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. హిందీలో ఈ సినిమా హాథీ మేరీ సాథీ పేరుతో రిలీజ్ అవుతోంది.

రానా, విష్ణు విశాల్, శ్రియా పిలగోన్కర్, జోయా హుస్సేన్ కీలక పాత్రలు పోషించిన ఈ సినిమాకు ప్రభు సాల్మన్ దర్శకుడు. ఈరోస్ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై తెరకెక్కింది అరణ్య