రామ్ చరణ్ ముఖ్య అతిధిగా శ్రీవల్లి ప్రీ రిలీజ్ వేడుక!

Saturday,September 09,2017 - 11:30 by Z_CLU

ప్రముఖ రచయిత విజయేంద్రప్రసాద్ దర్శకత్వం వహిస్తున్న ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం శ్రీవల్లి. రజత్, నేహా హింగే జంటగా నటిస్తున్నారు. రేష్మాస్ ఆర్ట్స్ పతాకంపై సునీత, రాజ్‌కుమార్ బృందావనం ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ నెల 15న విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుకను రేపు (సెప్టెంబర్ 10) గచ్చిబౌలి సంధ్య కన్వెన్షన్ సెంటర్లో గ్రాండ్ గా జరుపనున్నారు. ఈ వేడుకకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ముఖ్య అతిధి గా రాబోతున్నారు.

ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ.. ఓ వైవిధ్యమైన కథతో విజయేంద్రప్రసాద్ గారు ఎంతో అద్భుతంగా చిత్రాన్ని తీర్చిదిద్దారు. చిత్రీకరణ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు. ఈ సినిమాకి అన్నీ కలిసివస్తున్నాయి. దర్శకధీర రాజమౌళి గారు మా చిత్రానికి వాయిస్ ఓవర్ ఇవ్వడం ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణ. అలాగే ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు ప్రీ రిలీజ్ వేడుక కి వచ్చి మా టీం కి విశేష్ తెలుపుతుండటం వంటివి నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం.

శ్రీవల్లి ఈ నెల 15 వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజీవ్‌కనకాల, సత్యకృష్ణ, హేమ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎమ్.ఎమ్ శ్రీలేఖ, కెమెరా: రాజశేఖర్.