చరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ కు ముహూర్తం ఫిక్స్

Saturday,November 03,2018 - 11:19 by Z_CLU

టాలీవుడ్ మోస్ట్ ఎవెయిటింగ్ ప్రాజెక్టు రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి కాంబోలో రాబోతున్న మల్టీస్టారర్. ఇప్పుడీ ప్రాజెక్టు లాంఛింగ్ కు డేట్ ఫిక్స్ అయింది. నవంబర్ 11న ఉదయం 11 గంటలకు ఈ సినిమాను గ్రాండ్ గా లాంఛ్ చేయబోతున్నారు. డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాణ సంస్థ ఈ విషయాన్ని అఫీషియల్ గా ఎనౌన్స్ చేసింది. ఈ మేరకు ఓ యూట్యూబ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది

ఈ భారీ మల్టీస్టారర్ లాంఛింగ్ కు టాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకాబోతున్నారు. అదే రోజున సినిమా స్టోరీలైన్ పై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఎందుకంటే తన ప్రతి సినిమా ప్రారంభోత్సవం రోజున ఆ సినిమా స్టోరీలైన్ ను కొంచెం బయటపెట్టడం రాజమౌళి స్టయిల్.

ఈగ, మర్యాదరామన్న, మగధీర, బాహుబలి సినిమాల విషయంలో రాజమౌళి ఇదే ట్రెండ్ ఫాలో అయ్యాడు. సో.. 11వ తేదీన ఎన్టీఆర్-రామ్ చరణ్ మల్టీస్టారర్ కు సంబంధించి స్టోరీలైన్ బయటకొచ్చే అవకాశం ఉంది