మళ్ళీ తెరపైకొచ్చిన చెర్రీ-మణిరత్నం సినిమా

Sunday,May 28,2017 - 12:03 by Z_CLU

టాలీవుడ్ ప్రేక్షకులను ఎప్పటి నుంచో ఊరిస్తున్న క్రేజీ కాంబినేషన్స్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్-మణిరత్నం లది కూడా ఒకటి. ఆ మధ్య వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అనే వార్త వినిపించగానే సంతోషంలో మునిగిపోయారు మెగా ఫాన్స్. క్లాసీ లవ్ స్టోరీస్ తో ఎంటర్టైన్ చేసే మణి రత్నం చరణ్ ని ఎలా చూపిస్తాడా..ఎలాంటి స్టోరీ తో వీరిద్దరి సినిమా ఉంటుందా..అని ఎంతో క్యూరియాసిటీ తో వెయిట్ చేశారు కూడా.

అయితే మొన్నా మధ్య ఈ కాంబినేషన్ లో సినిమా డౌటే అని చరణ్ నెక్స్ట్ సినిమాను మరో డైరెక్టర్ తో ప్లాన్ చేసుకుంటున్నాడనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇక లేటెస్ట్ గా ఈ కాంబినేషన్ లో సినిమా మరో సారి తెరపైకి వచ్చింది. మణి రత్నంతో చరణ్ సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యాడని ఇప్పటికే ఈ సినిమా కథా చర్చల్లో మణి రత్నంను చరణ్ కలుస్తున్నాడనే టాక్ వినిపిస్తుంది. ఆల్మోస్ట్ ఫిక్స్ అయిపోయిన ఈ కాంబో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుందని ఈ సినిమాలో  ఐశ్వర్య రాయ్ కూడా ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే..