గ్రీన్ సిగ్నల్ కోసం చరణ్ వెయిటింగ్

Saturday,April 11,2020 - 12:41 by Z_CLU

మెగాస్టార్ చిరంజీవి, కొరటాలశివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ సినిమాలో మరో కీలక పాత్ర ఉందన్న విషయం తెలిసిందే. దాదాపు 20 నిమిషాల పాటు ఉండే ఈ పాత్రను మహేష్ బాబు చేస్తాడనే ప్రచారం మొన్నటి వరకూ జరిగింది. అయితే ఇప్పుడు మళ్ళీ చరణ్ అవును… తాజాగా మెగాస్టార్ కూడా ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు.

“అసలు మహేష్ పేరు ఎలా వచ్చిందో తెలియదు. తను కూడా నా బిడ్డ లాంటివాడే. తనతో నటించే అవకాశం వస్తే అద్భుతం. కానీ ఈ సినిమా వరకూ ముందు నుండి రామ్ చరణే అనుకున్నాం. సినిమాలో నాకు శిష్యుడిలాంటి క్యారెక్టర్ అది. ఒకవేళ రాజమౌళిగారు, కొరటాల శివగారు అండర్‌స్టాండింగ్‌కి వస్తే.. ‘ఆచార్య’లో చరణ్‌ ఉండొచ్చు. కుదరకపోతే… ఏమో! చెప్పలేను. నేను, చరణ్‌ కలిసి కంప్లీట్‌ సినిమా చేయాలన్నది సురేఖ కోరిక.”

సో… రాజమౌళి గ్రీన్ సిగ్నల్ కోసమే చరణ్ వెయిట్ చేస్తున్నాడనేది క్లియర్ కట్ చెప్పేశారు చిరు. ఇక కొరటాల శివ జక్కన్నను కలిసి చరణ్ రోల్ గురించి చర్చలు జరిపాక గానీ ఈ విషయంపై క్లారిటీ రాదు.