ఆస్కార్ బరిలో చెర్రీ హీరోయిన్..?

Sunday,November 06,2016 - 09:56 by Z_CLU

రామ్ చరణ్ మొదటి సినిమా చిరుతలో చెర్రీ సరసన హీరోయిన్ గా నటించిన నేహాశర్మ ఇప్పుడు ఏకంగా ఆస్కార్ బరిలో నిలిచింది. అవును.. నేహా శర్మ నటించిన ఓ సినిమా ఆస్కార్ కు ఎంపికవ్వడం గ్యారెంటీ అనే బజ్ నడుస్తోంది. అది కూడా ఇండియన్ మూవీ కాదు. ఓ చైనీస్ సినిమా. కాకపోతే అందులో ఇండియన్ టచ్ ఉంటుంది. ఆ ఎపిసోడ్ లో నేహాశర్మ వస్తుంది. ఆ సినిమానే ఇప్పుడు ఆస్కార్ కు ఎంపిక కాబోతోందనే టాక్ బలంగా వినిపిస్తోంది.

collage1

సువాన్ జాంగ్ అనే ఓ చైనీస్ మూవీలో నేహా శర్మ నటించింది. 7వ శతాబ్దంలో చైనా నుంచి భారత్ కు ప్రయాణించిన ఓ బౌద్ధ మత గురువు జీవితం ఆదారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ కాలంలో ఆ గురువు ప్రయాణానికి 17 ఏళ్ళు పట్టగా.. అప్పటి విజువల్స్ ను ఇప్పటి సినిమాలో మేకర్స్ అద్భుతంగా చూపించారని సమాచారం. అలాగే సువాంగ్ జాంగ్ కథాకథనాలు కూడా ఆకట్టుకోవడంతో సినిమాకు ఈసారి బెస్ట్ ఫారిన్ ఫిలిం కేటగిరీలో ఆస్కార్ గ్యారెంటీ అనే టాక్ వినిపిస్తోంది. ఇదే సినిమాలో నేహాశర్మతో పాటు సోనూసూద్ కూడా ఓ చిన్న పాత్ర పోషించాడు.