మాస్ మహారాజా రవితేజ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘రామారావు ఆన్ డ్యూటీ’ జూలై 29న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్కు సిద్ధంగా ఉంది. నూతన దర్శకుడు శరత్ మండవ దర్శకత్వంలో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, రవితేజ టీం వర్క్స్ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.
‘రామారావు ఆన్ డ్యూటీ’ ని రవితేజ కెరీర్లో బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలపడానికి చిత్ర యూనిట్ అన్ని విధాల భారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టింది. ఈ సినిమా ప్రమోషన్ మెటీరియల్కి కూడా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది.
ఈరోజు ఈ సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ల్యాండ్ అవ్వబోతోంది. సరిగ్గా రాత్రి 8 గంటల 1 నిమిషానికి ట్రయిలర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమౌతుంది. టీజర్ సినిమాలోని యాక్షన్ సైడ్ని చూపించగా, ట్రైలర్ మిగతా ఎలిమెంట్స్ ప్రజంట్ చేయడానికి సిద్దమౌతుంది.
1995 నాటి నేపథ్యంలో యదార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో రజిషా విజయన్, దివ్యాంశ కౌశిక్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సత్యన్ సూర్యన్ ఐఎస్సి సినిమాటోగ్రఫీ అందించగా, ప్రవీణ్ కెఎల్ ఎడిటర్ గా పని చేస్తున్నారు.