సెన్సేషన్ క్రియేట్ చేస్తున్న ఉన్నది ఒకటే జిందగీ

Monday,October 16,2017 - 01:03 by Z_CLU

రామ్ ‘వున్నది ఒక్కటే జిందగీ’ అక్టోబర్ 21 న రిలీజ్ కి రెడీ అవుతుంది. రీసెంట్ ఆడియో రిలీజ్ జరుపుకున్న ఈ సినిమా ట్రేలర్సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తుంది. ఫ్రెండ్షిప్ బేస్డ్ ఇంటరెస్టింగ్ యూత్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా యూత్ లో ఇంటరెస్టింగ్ బజ్ ని క్రియేట్ అవ్వడం లో సక్సెస్ అయింది. ఈ ట్రేలర్ రిలీజ్ అయిన 24 గంటల్లోనే ఏకంగా 4 మిలియన్ వ్యూస్ కరాస్ చేసిందంటే ఫ్యాన్స్ లో ఈ మూవీ ఏ రేంజ్ లో డిమాండ్ క్రియేట్ చేసుకుందో తెలిసిపోతుంది.

ఫుల్లీ లోడెడ్ యూత్ ఇమోషనల్ యూత్ ఎంటర్ టైనర్ గా సినిమాలో లావణ్య త్రిపాఠితో పాటు, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్స్ గా నటించారు. కిషోర్ తిరుమల డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమాకి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేశాడు. స్రవంతి రవి కిషోర్ ఈ సినిమాకి  ప్రొడ్యూసర్.