

Monday,July 10,2023 - 04:20 by Z_CLU
కోర్ టీమ్, కొంతమంది ప్రత్యేక అతిథుల సమక్షంలో ఈరోజు ‘డబుల్ ఇస్మార్ట్’ లాంచ్ వేడుక గ్రాండ్ గా జరిగింది. ఛార్మి క్లాప్ ఇవ్వగా, హీరో రామ్ పోతినేనిపై చిత్రీకరించిన తొలి సన్నివేశానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ముహూర్తపు సన్నివేశంలో “ఇస్మార్ట్ శంకర్ అలియాస్ డబుల్ ఇస్మార్ట్’ అని రామ్ డైలాగ్ చెప్పాడు.
“డబుల్ ది ఎంటర్టైన్మెంట్! డబుల్ ది యాక్షన్! డబల్ ది మ్యాడ్నెస్! వి ఆర్ బ్యాక్ !! #డబుల్ఇస్మార్ట్ మోడ్ ఆన్! ” అంటూ లాంచింగ్ ఈవెంట్ లో ఫోటోలని ట్విట్టర్ లో షేర్ చేశారు రామ్. డబుల్ ఇస్మార్ట్ రెగ్యులర్ షూటింగ్ ఈ నెల 12 నుంచి ప్రారంభం కానుంది.
ఇస్మార్ట్ శంకర్ రామ్తో పాటు పూరీ జగన్నాథ్కి చాలా ప్రత్యేకమైన సినిమా. ఈ సినిమా హీరోకి, దర్శకుడికి బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్గా నిలిచింది. దీంతో ఈ ప్రాజెక్ట్ చుట్టూ ఎక్సయిట్మెంట్, అంచనాలు భారీగా వున్నాయి. రామ్ని ఇస్మార్ట్ శంకర్ కంటే మాసియర్ క్యారెక్టర్లో చూపించబోతున్నారు పూరి జగన్నాధ్.
డబుల్ ఇస్మార్ట్ పాన్ ఇండియా విడుదల కానుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో మార్చి 8, 2024న మహా శివరాత్రికి విడుదలౌతుంది.