ఈ దసరాకి ముగ్గురు హీరోల పోటీ

Wednesday,July 20,2016 - 07:30 by Z_CLU

పండగ అనగానే ఒకటో రెండో సినిమాలు విడుదల అవ్వడం సహజమే. అందులోకి పది రోజులు సెలవలు వచ్చే పండగలకు మరీ డిమాండ్ ఎక్కువ. అందుకే ఈ పండగల కు చిత్రీకరణ లో ఉండగానే థియేటర్స్ పై కర్చీఫులు వెసేస్తారు స్టార్ హీరోలు. ఇక రాబోతున్న దసరా పండగ కు ఓ ముగ్గురు హీరో లు ఇలా తమ సినిమాలతో పోటీ పడడానికి సిద్ధం అవుతున్నారు. ఇక ఈ పోటీ లో ముందున్నారు రామ్ చరణ్. అక్టోబర్ 7 న న ‘ధ్రువ’ తో రామ్ చరణ్ ఈ పోటీ లో నిలబడనున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ రోజే దసరా కి విడుదల అంటూ ప్రకటించేసారు చిత్ర యూనిట్. ఇక తాజాగా కళ్యాణ్ రామ్ కూడా దసరా పై కన్నేశాడు. ప్రస్తుతం పూరి దర్శకత్వం లో కళ్యాణ్ రామ్ నటిస్తున్న ‘ఇజం’ సినిమాను సెప్టెంబర్ 29 న విడుదల చెయ్యడానికి నిర్మాతగా సన్నాహాలు చేసుకుంటున్నాడు . ఇక ఆ మరుసటి రోజే అంటే సెప్టెంబర్ 30 న రామ్ కూడా తను ప్రస్తుతం సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వం లో నటిస్తున్న సినిమాతో థియేటర్స్ లో అడుగుపెట్టబోతున్నాడు.  . మరి ఇలా ఈ సారి దసరా కి ఈ ముగ్గురు రామ్ లు పోటీ పడబోతున్నారు. మరి ఇంకా సమయం ఉంది కాబట్టి ఈ పోటీ లో ఇంకొందరు హీరో లు కూడా నిలబడే ఛాన్స్ ఉంది.