చరణ్ మొదలెట్టేశాడు..

Sunday,April 02,2017 - 11:00 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఎట్టకేలకి నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చేసేశాడు. ‘ధృవ’ సినిమా తర్వాత నిర్మాతగా బిజీ అయిన చరణ్ సుకుమార్ డైరెక్షన్ లో తెరకెక్కనున్న సినిమాను సెట్స్ పై పెట్టేశాడు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై విల్లేజ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాతో సరికొత్తగా లుక్ లో కనిపిస్తూ డిఫరెంట్ యాక్టింగ్ తో ఎంటర్టైన్ చేయబోతున్నాడు చరణ్.

రీసెంట్ గా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన ఈ సినిమా ఈరోజే సెట్స్ పైకి వెళ్ళింది.. రాజమండ్రి కి దాదాపు 60 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరి లో 30 రోజుల పాటు ఈ షెడ్యూల్ జరగనుంది. ఈ షెడ్యూల్ పూర్తి చేసిన తరువాత కాస్త టైం తీసుకొని మరో షెడ్యూల్ ప్లాన్ చేయనున్నారు యూనిట్.

ఫస్ట్ లుక్ తోనే టాక్ అఫ్ ది ఇండస్ట్రీ గా మారిన ఈ సినిమాలో చరణ్ లుక్, మాట ఎలా ఉంటుందా..అనే ఎగ్జైట్ మెంట్ తో ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు మెగా ఫాన్స్. మరి పల్లెటూరి కుర్రాడిగా చరణ్ ఈ సినిమాతో ఏ రేంజ్ లో ఎంటర్టైన్ చేస్తాడో..చూడాలి.