ముహూర్తం ఫిక్స్

Saturday,January 28,2017 - 06:04 by Z_CLU

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా ను సెట్స్ పై పెట్టడానికి రెడీ అవుతున్నాడు. లేటెస్ట్ గా ‘ధృవ’ సినిమాతో మరో గ్రాండ్ హిట్ అందుకున్న చెర్రీ మొన్నటి వరకూ ‘ఖైదీ నంబర్ 150’ నిర్మాతగా ఆ సినిమా పనుల్లో బిజీ గా గడిపాడు. ఇక నాన్న సినిమా రిలీజ్ అయ్యాకే తన నెక్ట్స్ సినిమా ను స్టార్ట్ చేస్తానని చెప్పిన చరణ్ ప్రెజెంట్ ఆ సినిమా పై ఫోకస్ పెట్టేసాడు. సుకుమార్ దర్శకత్వం లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కనున్న ఈ సినిమాను ను ఫిబ్రవరి నుంచి సెట్స్ పెట్టబోతున్నాడు చరణ్.

విల్లేజ్ బాగ్రాప్ లో ఫామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమాలో చరణ్ సరసన సమంత నటించనుందని సమాచారం. ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫైనల్ స్టేజ్ కి చేరుకున్న ఈ సినిమా జనవరి 30 న పూజా కార్యక్రమాలతో ప్రారంభమై ఫిబ్రవరి నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది సమాచారం.