Thursday,August 04,2016 - 03:26 by Z_CLU
ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ధ్రువ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈరోజు ఒకేసారి రెండు లొకేషన్లలో బ్యాక్-టు-బ్యాక్ షూట్ చేశాడు రామ్ చరణ్. ఉదయాన్నే చార్మినార్ చేరుకున్నాడు. చార్మినార్ బ్యాక్ డ్రాప్ లో కొన్ని సన్నివేశాల్ని చిత్రీకరించారు. ఆ వెంటనే లొకేషన్ అన్నపూర్ణ స్టుడియోస్ కు షిఫ్ట్ అయింది. ప్రస్తుతం అన్నపూర్ణలో రామ్ చరణ్, హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ పై కొన్ని సీన్లు తీస్తున్నారు. చార్మినార్ షూటింగ్ లో భాగంగా… షాట్ గ్యాప్ లో చార్మినార్ ఎక్కేశాడు చరణ్. మెట్లు అన్నీ ఎక్కుకుంటూ పైకి చేరుకున్నాడు. అక్కడి నుంచి ఓల్డ్ సిటీని ఏరియల్ షాట్ లో చూశాడు. అంతేకాదు… చార్మినార్ సందర్శించిన తన వీడియోను ఫేస్ బుక్ లో కూడా పోస్ట్ చేశాడు చరణ్. దసరా కానుకగా అక్టోబర్ లో ధ్రువ సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా… ఈనెల 22న ధ్రువ ఫస్ట్ లుక్ విడుదలకానుంది.
Wednesday,March 27,2024 01:06 by Z_CLU
Wednesday,March 27,2024 10:10 by Z_CLU
Tuesday,March 26,2024 03:28 by Z_CLU
Tuesday,June 20,2023 10:05 by Z_CLU