రిపీట్ అంటున్న రామ్

Sunday,January 28,2018 - 12:02 by Z_CLU

ఇటీవలే ‘వున్నది ఒకటే జిందగీ’ సినిమాతో ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసిన రామ్ త్వరలోనే నెక్స్ట్ సినిమాను సెట్స్ పై పెట్టబోతున్న సంగతి తెలిసిందే.. దిల్ రాజు నిర్మాణం త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఓ యూత్ ఫుల్ లవ్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కనున్న ఈ సినిమా ప్రెజెంట్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిషింగ్ స్టేజికి చేరుకుంది. ఈ సినిమాలో రామ్ సరసన మొన్నటి వరకూ కిరాక్ పార్టీ బ్యూటీ రష్మిక మండన పేరు వినిపించగా లేటెస్ట్ గా ఈ సినిమాకు హీరోయిన్ గా అనుపమ పరమేశ్వరన్ ను ఫైనల్ చేసారనే వార్త వినిపిస్తుంది.

లేటెస్ట్ గా ‘వున్నది ఒకటే జిందగీ’ సినిమాలో రామ్ తో జతకట్టిన ఈ బ్యూటీ… క్యారెక్టర్ కి పర్ఫెక్ట్ అని భావించిన యూనిట్ ఈ సినిమాకు అనుపమనే హీరోయిన్ గా కన్ఫర్మ్ చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఫాస్ట్ ఫేజ్ లో ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఫినిష్ చేసుకుంటున్న ఈ సినిమాకు ప్రసన్న కుమార్ కథ-మాటలు అందిస్తున్నాడు. ప్రకాష్ రాజ్ కీ రోల్ లో నటించనున్న ఈ సినిమా మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది.