సుకుమార్ సినిమాకు రకుల్‌ ప్రీత్ ప్రచారం

Tuesday,July 04,2017 - 11:59 by Z_CLU

వైవిధ్యమైన చిత్రాలతో దర్శకుడిగా అందరి ప్రశంసలు అందుకుంటున్న క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ నిర్మాతగా మారి నిర్మించిన తొలి చిత్రం కుమారి 21 ఎఫ్ ఎంతటి విజయాన్ని సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు సుకుమార్ నిర్మాతగా తన సొంత సంస్థలో నిర్మిస్తున్న మరో వైవిధ్యమైన ప్రేమకథా చిత్రం ‘దర్శకుడు’. సుకుమార్ రైటింగ్స్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమాలో అశోక్, ఈషా జంటగా నటిస్తున్నారు. హరిప్రసాద్ జక్కా దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలోని ‘ఆకాశం దించి మేఘాల్లో సెట్ వేస్తా’ అనే పాటను టాప్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌సింగ్ విడుదల చేశారు.

ఈ సందర్భంగా రకుల్‌ప్రీత్ మాట్లాడుతూ సుకుమార్ ఆలోచనలన్నీ వినూత్నంగా వుంటాయి. ఆయన నిర్మాతగా రూపొందిన ఈ చిత్రం తప్పకుండా అందర్ని అలరిస్తుందనే నమ్మకం వుంది అని తెలిపింది. త్వరలోనే మిగతా పాటలను కూడా ఒక్కొక్కటి విడుదల చేసి.. ఆ తర్వాత పూర్తి ఆడియోను గ్రాండ్‌గా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీత దర్శకుడు.