రజినీకాంత్ కొత్త సినిమా లాంచ్ అయింది

Wednesday,December 11,2019 - 11:50 by Z_CLU

రజినీకాంత్ కొత్త సినిమాని ఈ రోజు పూజ కార్యక్రమాల మధ్య అఫీషియల్ గా లాంచ్ చేశారు మేకర్స్. త్వరలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాలో సీనియర్ హీరోయిన్స్ మీనా, ఖుష్బూ కీ రోల్ ప్లే చేస్తుండగా కీర్తి సురేష్, రజినీకాంత్ కి కూతురిలా కనిపించనుంది.

త్వరలో సెట్స్ పైకి రావడానికి రెడీ అవుతున్న ఈ సినిమా ఆల్మోస్ట్ పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ సినిమాకి ఇమ్మన్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. ప్రస్తుతం రిలీజ్ కి రెడీగా ఉన్న ‘దర్బార్’ లో పవర్ ఫుల్ పోలీసాఫీసర్ గా నటించిన రజినీకాంత్ ఈ సినిమాలో మరో పవర్ ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతు న్నాడు.

సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా మరో ముఖ్య పాత్రలో నటించనున్నాడు. శివ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా సన్ పిక్చర్స్ బ్యానర్ లో తెరకెక్కుతుంది.