2.0 మళ్ళీ మళ్ళీ చూడాలనుకుంటున్నారు
Friday,November 30,2018 - 06:32 by Z_CLU
సెన్సేషన్ క్రియేట్ చేస్తుంది రజినీకాంత్ 2.0. తెలుగు స్టేట్స్ లో ఫస్ట్ డే 21.5 కోట్లు కలెక్ట్ చేయగలిగింది. ఈ సందర్భంగా చిత్ర సమర్పకులు N.V. ప్రసాద్, దిల్ రాజు, ఈ సినిమాకి సంబంధించి ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి, సినిమాకి సంబంధించి మరిన్ని విషయాలు మాట్లాడారు.
N.V. ప్రసాద్: ప్రపంచవ్యాప్తంగా నిన్న రిలీజ్ అయిన ‘2.0’ సంచలనమైన కలెక్షన్లతో అద్భుత విజయంతో దూసుకెళ్తుంది. నాలుగు సంవత్సరాలు చిత్ర యూనిట్ పడిన కష్టం సినిమాలో కనిపిస్తుంది. దానికి ప్రతిఫలంగానే ప్రేక్షకులు సినిమాలోని రజనీకాంత్ అవతారాలన్నింటినీ ఎంజాయ్ చేస్తున్నారు. ఒక కొత్త సందేశంతో కూడుకున్న ఈ సినిమా ఇంకా సంచలన రికార్డులు సాధించాలని కోరుకుంటున్నాం.
దిల్ రాజు : 2.0 చిత్రం అద్భుత విజయాన్ని సాధించింది. నేను మూడు సార్లు చూశాను. ఈ మధ్యకాలంలో ఏ సినిమాని అన్నిసార్లు చూడలేదు. శంకర్గారు ఈ సినిమాని హాలీవుడ్ స్థాయిలో విజువల్గా చూపించారు. ఇండియన్ సినిమాలోనే ఇంత భారీ బడ్జెట్ సినిమా ఇంతవరకు రాలేదు. సినిమా మొత్తం ఒక ఎత్తయితే చివరి 20 నిమిషాలు మరో ఎత్తు. శంకర్గారు ఎన్ని చేసినా చివరలో ఫార్ములాను తీసుకొచ్చి రజనీకాంత్గారితో మేజిక్ చూపించారు. ఆ 20 నిమిషాల ట్రెమండస్ ఫీలింగ్తోనే ఆడియన్స్ థియేటర్ నుంచి బయటికి వస్తున్నారు. చూసినవాళ్ళు మళ్ళీ మళ్ళీ చూడాలని కోరుకుంటున్నారు.