'సైనైడ్' లో ప్రియమణి

Thursday,October 01,2020 - 02:28 by Z_CLU

జాతీయ, అంతర్జాతీయ అవార్డు గ్రహీత రాజేష్ టచ్‌రివర్ దర్శకత్వంలో జాతీయ అవార్డు గ్రహీత ప్రియమణి నటించనున్న చిత్రం ‘సైనైడ్’. మిడిల్ ఈస్ట్ సినిమా ప్రై లిమిటెడ్ పతాకంపై ప్రదీప్ నారాయణన్ నిర్మిస్తున్నారు.

దేశంలోనే సంచలనం సృష్టించిన ‘సైనైడ్’ మోహన్ కేసు ఆధారంగా క్రైమ్ థ్రిల్లర్‌గా ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. తెలుగు, హిందీ, మలయాళ, కన్నడ, తమిళ భాషల్లో రాబోతున్న ఈ సినిమాలో ప్రియమణి ప్రధాన పాత్రలో నటిస్తుండగా… హిందీలో ఆ పాత్రలో యశ్ పాల్ శర్మ నటిస్తున్నారు. ప్రియమణి ఇందులో ఇన్వెస్టిగేషన్ పోలీసాఫీసర్ గా కనిపించనుంది.

సైనైడ్ ఇచ్చి 20మంది యువతులను కిరాతకంగా హత్య చేసిన ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మోహన్ కేసును అత్యంత అరుదైన కేసుగా కోర్టు తీర్మానించింది. ఈ సంచలనాత్మక కేసు ప్రేరణగా తీసుకొని ‘సైనైడ్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.

జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమవుతుంది.